in

Crazy multi starrer movie is being planned between brothers!

స్టార్ హీరోస్ సూర్య , కార్తీ లకు తమిళభాషతో పాటు తెలుగుభాషలో కూడా మంచి స్టార్ డమ్ ఉన్న విషయం తెలిసిందే. అన్నదమ్ములైన సూర్య మరియు కార్తీ లు కలిసి నటించాలనుకుంటున్నారు. అభిమానులు కూడా వీరిద్దరి మల్టీ స్టారర్ కోసం వెయిట్ చేస్తున్నారు. గత రెండు మూడు సంవత్సరాలుగా వీరి మల్టీ స్టారర్ మూవీ గురించి మీడియాలో చర్చ జరుగుతోంది..లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో కార్తీ హీరోగా తెరకెక్కిన “ఖైదీ” మూవీ తమిళ , తెలుగు భాషలలో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ మూవీ కి సీక్వెల్ తెరకెక్కించే సన్నాహాలలో దర్శకుడు లోకేష్ ఉన్నారు. లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో కమల్ హీరోగా తెరకెక్కిన “విక్రమ్” మూవీ జూన్ 3వ తేదీ రిలీజ్ కానుంది. జులై లోనే “ఖైదీ” సీక్వెల్ తెరకెక్కించే ప్లాన్ లో దర్శకుడు ఉన్నారనీ , ఈ సీక్వెల్ లో ఒక కీలక పాత్రలో సూర్య నటించనున్నారనీ సమాచారం. అన్నదమ్ముల మల్టీ స్టారర్ మూవీకై అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

Mukesh Bhatt Responds To Mahesh Babu’s Controversial Comments!

Kiara Advani Or Rashmika, Who Will romance Prabhas In spirit?