
త్వరలో నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించబోయే చిత్రానికి హీరో గా ప్రభాస్ ఇప్పటికే ఖరారైనప్పటికీ ప్రతినాయికను నిర్ణయించలేదు. అయితే, బాలీవుడ్ సొగసరి కత్రినాకైఫ్ ప్రభాస్ సరసన నటించనున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి చిత్రం ద్వారా ఒక్కసారిగా ఆల్ టైం స్టార్ డామ్ సంపాదించిన ప్రభాస్ తన అంచనాలను ఒక్కసారిగా పెంచేశాడు. బాహుబలి-2 తర్వాత అంచానాలు తగ్గట్టుగానే భారీ బడ్జెట్ తో నిర్మించిన సాహో చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ అందాల భామ శ్రద్దా కపూర్ ను ఎంపిక చేశారు. దీంతో మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా తన తదుపరి చిత్ర ప్రతినాయిక కోసం బాలీవుడ్ లో వెదుకులాట మొదలెట్టాడా అనే సందేహాలు మొదలయ్యాయి. కాగా ప్రస్తుత టాలీవుడ్ దర్శకుల చూపు బాలీవుడ్ వైపు మళ్లింది.

