in

Balakrishna, Trisha reunite for Gopichand Malineni’s film?

ఏడాది క్రాక్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన దర్శకుడు గోపీచంద్ మలినేని.. త్వరలో నందమూరి బాలకృష్ణతో ఓ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించనుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది.

తాజాగా దర్శకుడు గోపీచంద్..త్రిషకి కథను వినిపించగా అందుకు ఆమె ఒకే చెప్పినట్టు సమాచారం. లయన్ సినిమా తరవాత బాలకృష్ణతో, బాడీగార్డ్ సినిమా తర్వాత దర్శకుడు గోపిచంద్ తో సినిమా చేస్తోంది త్రిష. ఈ సినిమాని దసరా నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే సినిమాని చేస్తున్నారు..

Jagapathi Babu wishes and supports Anandhayya’s corona medicine!

cinema bandi!