in

ARJUN REDDY ACTRESS GETS A CRAZY OFFER!

ర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచమయ్యారు షాలిని పాండే. ఆ తర్వాత కొన్ని సినిమాలలో నటిస్తూ బిజీ అయిపోయింది ఈ భామ. అటు హిందీ ప్రేక్షకులను అలరించడానికి కూడా సిద్ధమయ్యింది. బాలీవుడ్ హీరో రణ్‏వీర్ సింగ్‏తో జయేష్ భాయ్ జోర్దార్ సినిమాలో నటించింది షాలిని. ఇక ఆ మూవీ షూటింగ్ పూర్తయ్యి విడుదలకు సిద్ధంగా ఉంది. కాగా తాజాగా షాలిని తన రెండో హిందీ సినిమాకు ఓకే చెప్పినట్టుగా సమాచారం.

అది కూడా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్‍కు జంటగా నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే అమీర్ తనయుడు జునైద్ ఖాన్ బాలీవుడ్‏ ఇండస్ట్రీకి పరిచయం కావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సిద్ధార్థ్ పి.మల్హోత్రా దర్శకత్వంలో ఈ సినిమాను చిత్రీకరించనుండగా.. ఈ మూవీలో షాలీని హీరోయిన్‏గా నటించనున్నారట. ఈ సినిమాను యశ్ సంస్థ నిర్మించనుంది. రోమాంటిక్ డ్రామగా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాదిలో ప్రారంభం కానుంది.

bunny and mahesh fans not happy with sam’s tweet!

sai sreenivas nu music director thaman ga marchina director shankar!