in

anasuya gives clarity about not accepting new offers!

యాంకర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అనసూయ భరద్వాజ్. జబర్దస్త్ అనే స్టాండప్ కామెడీ షో ద్వారా ముందుగా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమయ్యింది. ఇప్పుడు సినిమాల్లో నటిస్తూ తనలో మంచి నటి కూడా ఉంది అని ప్రూవ్ చేసుకుంటోంది. తాజాగా సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్‌తో ముచ్చటించిన అనసూయకు ఎందుకు తక్కువ సినిమాలు చేస్తారు అనే ప్రశ్న ఎదురయ్యింది. అనసూయ ముందుగా అడవి శేష్ హీరోగా తెరకెక్కిన ‘క్షణం’తో వెండితెరకు పరిచయమయ్యింది. ఈ సినిమాలో తన యాక్టింగ్‌తో పలు పెద్ద డైరెక్టర్స్‌ను సైతం ఇంప్రెస్ చేసింది.

అందుకే సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగస్థలం’లో రంగమ్మత్తలాంటి కీలక పాత్ర పోషించే ఛాన్స్ కొట్టేసింది. తన యాక్టింగ్‌కు మంచి మార్కులే పడుతున్నా.. సినిమాలు చేసే విషయంలో ఏ మాత్రం స్పీడ్ చూపించట్లేదు అనసూయ..ఇటీవల మీరు చాలా తక్కువ సినిమాలు చేస్తున్నారు ఎందుకు అంటూ ప్రశ్నించాడు అనసూయ అభిమాని. దానికి సమాధానంగా ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రల్లో, సినిమాల్లో నటించాలని తాను అనుకుంటున్నట్టు తెలిపింది అనసూయ. చేసిన పాత్రలు మళ్లీ మళ్లీ చేయాలని అనుకోను అని చెప్పింది. తనను ఏదైతే ఎగ్జైట్ చేయదో ఆ పాత్ర చేయనంటూ క్లారిటీ ఇచ్చేసింది అనసూయ.

pooja hegde worried about acharya result!

‘gurudu’ Actress Ritu Kaur Latest Photoshoot Stills!