
జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ (వర్కింగ్ టైటిల్: డ్రాగన్) కోసం చిత్రబృందం భారీ తారాగణాన్ని రంగంలోకి దింపుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్-అలియా జోడీని మళ్ళీ వెండితెరపై చూడాలని ఆశపడుతున్న అభిమానులకు ఇది తీపి కబురు. ఇప్పటికే చిత్రబృందం ఆమెతో సంప్రదింపులు జరిపిందని, అలియా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు, ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది..!!

