in

after akkineni’s its daggubati’s manam now!

విక్టరీ వెంకటేష్, టాలీవుడ్ హల్క్ రానా, యువ సామ్రాట్ నాగచైతన్య.. ఈ ముగ్గురి కాంబినేషన్ లో ఓ మల్టిస్టారర్ చేయాలన్నది స్వర్గీయ దిగ్గజ నిర్మాత డి. రామానాయుడు కల. త్వరలోనే ఈ మూవీ మొఘల్ స్వప్నం సాకారం కానుంది. డి. రామానాయుడు తనయుడు డి. సురేష్ బాబు నిర్మాణంలో ఈ మల్టిస్టారర్ తెరకెక్కనుంది. అంతేకాదు.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి దర్శకుడు కూడా దాదాపుగా కన్ఫామ్ అయ్యారు.

ఈ విషయాన్ని డి. సురేష్ బాబు స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇంతకీ ఆ దర్శకుడెవరంటే.. ‘శతమానం భవతి’ వంటి ఉత్తమ కుటుంబ కథా చిత్రాన్ని అందించిన సతీష్ వేగేశ్న. ఇప్పటికే వెంకీ, రానా, చైతూ సినిమాకి సంబంధించి కథాచర్చలు పూర్తయ్యాయని, వచ్చే ఏడాది ఈ మూవీ పట్టాలెక్కుతుందని సమాచారం. మరి.. మనం తరహాలో ఈ మల్టిస్టారర్ కూడా మెమరబుల్ మూవీగా నిలుస్తుందేమో చూడాలి.

monal’s item song in bellamkonda’s ‘alludu adhurs’!

Rashi Khanna to mark her comeback in Bollywood!