in

Actor Mohan Babu says goodbye to active politics!

పీ మంత్రి పేర్నినానితో భేటీపై డైలాగ్ కింగ్ మోహన్‌బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనతో తనకు ఎప్పటి నుంచో అనుబంధం ఉందని.. ఇంటికొస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఇటీవల ఇద్దరం ఓ పెళ్లిలో కలిశామన్నారు. ముఖ్యమంత్రి జగన్తో ఇండస్ట్రీ వాళ్లు  చర్చించిన అంశాలేవీ తమ మధ్య చర్చకు రాలేదని ఆయన అన్నారు. ఈ విషయాన్ని కొంతమంది అనవరసరంగా రాద్ధాంతం చేశారని మోహన్ బాబు మండిపడ్డారు. ”ప్రస్తుతం తాను సినిమాలు, యూనివర్సిటీ పనుల్లో బిజీగా ఉన్నానని…

ఇకపై ప్రత్యక్ష రాజకీయాల వైపు వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు” డైలాగ్ కింగ్ మోహన్ బాబు చెప్పారు. 2019 ఎన్నికలకు ముందు మోహన్ బాబు వైకాపాలో చేరిన సంగతి తెలిసిందే. చంద్రబాబు, జగన్ నాకు బంధువులు కాబట్టి గతంలో ప్రచారం చేశానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. మోహన్ బాబు నటించిన తాజా చిత్రం‘’సన్‌ ఆఫ్‌ ఇండియా’. ఈ సినిమాకు డైమండ్‌ రత్నబాబు దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మీనా, ప్రజ్ఞా జైస్వాల్‌, శ్రీకాంత్‌, అలీ, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలు చేశారు. మంచు విష్ణు నిర్మాతగా వ్యవహారించారు. ఈ నెల 18న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది ఈ చిత్రం.

Introducing Sreeleela In Ravi Teja’s ‘Dhamaka’!

30 years for ‘allari mogudu’!