in

A BIG SHOCK TO SHALINI PANDEY !

తాజాగా షాలినీ పాండే.. బాలీవుడ్ సినిమాలను చూసి తమిళ ఇండస్ట్రీని చిన్న చూపు చూస్తుందనే వివర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా షాలీనీ పాండే పై తమిళ నిర్మాత ఒకాయన క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. విజయ్ ఆంటోని హీరోగా నటిస్తున్న ‘అగ్ని సిరాగుగుల్’ సినిమాలో నటిస్తానని సైన్ చేసింది షాలినీ పాండే. ఒక షెడ్యూల్లో కూడా యాక్ట్ చేసిన తర్వాత ఈ సినిమాషూటింగ్‌కు రావడం మానేసిందంట. షూటింగ్‌కు ఎందుకు రావడం లేదంటే బాలీవుడ్లో ఆఫర్లు వస్తున్నందుకు ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపడం లేదని తెలిపింది. ఇక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ప్రొడక్షన్ వాళ్లు ఈ విషయమై తెలుగు, తమిళ ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు.. షాలినీ పాండే పై క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం షాలినీ పాండే.. రణ్‌వీర్ సింగ్ సరసన ‘జయేష్ భాయ్ జోర్దార్’ అనే సినిమాలో అవకాశం వచ్చింది. ఈ ఆఫర్‌ రావడంతో షాలినీ పాండే తమిళ సినిమాకు హ్యాండ్ ఇచ్చింది. షాలినీ పై హ్యాండ్ ఇవ్వడంతో చేసేది లేక చిత్ర నిర్మాతలు ఇపుడు విజయ్ ఆంటోని ‘అగ్ని సిరాగుగల్’లో ఆమె ప్లేస్‌లో అక్షరా హాసన్‌ను తీసుకున్నారు.

ATHMA HATHYA CHESUKUNTANANNA SRIKANTH!

TOP 10 MOVIES OF THE DECADE YOU MUST NOT SEE WITH YOUR PARENTS!