in

Rashmika mandanna says ‘Bhooma Devi is close to my heart’!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన కెరీర్‌లో మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎంతో ఉత్సాహంగా ఉన్న రష్మిక.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన ‘గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులు-2025’లో ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. శనివారం వెలువడిన ఈ ఫలితాల్లో ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రంలోని ఆమె అద్భుత నటనకు గాను ఈ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా రష్మిక సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు..

“గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ నటిగా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. నిజంగా కృతజ్ఞురాలిని. ఈ సినిమాలో నేను పోషించిన ‘భూమా దేవి’ పాత్ర నా మనసుకు ఎంతో దగ్గరైంది” అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచిన దర్శకుడు రాహుల్ రవీంద్రన్, గీతా ఆర్ట్స్ సంస్థ, నిర్మాతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ గౌరవం దక్కడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు రష్మిక ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు..!!

WHO IS BEHIND THE NAME “GEETHA ARTS”!

The title reveal of Allu Arjun and Atlee’s film on this day!