తమ కుటుంబంపై కొందరికి ఉన్న వ్యక్తిగత కక్షల కారణంగా సినిమాను లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం చేసే అవకాశం ఉందని భావించిన చిత్ర బృందం, ఈ విషయంలో కోర్టును ఆశ్రయించింది. ఉద్దేశపూర్వకంగా సినిమా ప్రతిష్ఠను దెబ్బతీసేలా, వ్యక్తిగత దూషణలకు పాల్పడితే తీవ్రమైన చర్యలు తప్పవని, ఈ విషయమై తాము తీసుకునే చర్యలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తూ సోషల్ మీడియాలో పబ్లిక్ కాషన్ నోటీస్ను కూడా విడుదల చేసింది..
సినిమాను చూసి, వాస్తవాల ఆధారంగా తమ అభిప్రాయాలను పంచుకోవాలని, అంతేగానీ వ్యక్తిగత ద్వేషంతో, పరువు నష్టం కలిగించేలా వ్యవహరిస్తే న్యాయపరమైన మార్గాలను అనుసరిస్తామని చిత్ర బృందం తెలిపింది. గతంలో కేరళలో ఓ నిర్మాత ఇలాంటి చర్యలు తీసుకున్న ఉదంతాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుచేశారు. సినిమాపై దుష్ప్రచారం చేసేవారిని నిలువరించేందుకే ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ‘కన్నప్ప’ టీమ్ స్పష్టం చేసింది..!!