వేదం సినిమా రిలీజ్ అయ్యి నేటికీ సరిగ్గా 15 ఏళ్ళు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కూడా ఒక స్పెషల్ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా అప్పుడు జరిగిన సంఘటనలు కూడా గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఆశ్చర్యపోయే సంఘటన అందరిని ఆశ్చర్యపరిచే సంఘటన ఒకటి జరిగింది. అదేంటంటే వేదం సినిమా నుంచి అనుష్క ధరించిన పసుపు రంగు చీర స్టిల్స్ ని ప్రమోషన్స్ లో బాగా ఉపయోగించారు. ఆ ఫోటోలో అనుష్క పసుపు రంగు చీర కట్టుకొని వెనక్కి తిరిగి చూస్తూ మత్తెక్కించే చూపులతో యువతను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ చిత్రం విడుదల సమయంలో..
ప్రమోషన్స్ లో భాగాంగా హైదరాబాద్ పంజాగుట్ట సర్కిల్ లో అనుష్క వెనక్కి తిరిగి చూస్తున్న ఫోటోని పెద్ద హోర్డింగ్ గా పెట్టారు. దీంతో ఆ హోర్డింగ్ లో అనుష్కని చూస్తూ వాహనదారులు యాక్సిడెంట్స్ చేసారు. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అనుష్క హోర్డింగ్ వల్ల దాదాపు 40 యాక్సిడెంట్ లు అయ్యాయట. పెద్ద యాక్సిడెంట్స్ కాకపోయినా ఆ హోర్డింగ్ చూస్తూ ముందు ఉన్న వాహనాలను గుద్దేసేవారట. దీంతో రెగ్యులర్ గా యాక్సిడెంట్స్ జరగడంతో పోలీసులు ఇది గమనించి GHMC అధికారులతో కలిసి అనుష్క హోర్డింగ్ ని తొలగించారట.