గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ గురించి కూడా ఒక గాలివార్త తెగ వైరల్ గా మారింది. అదేంటంటే హైదరాబాద్లో తాను ఉంటున్న ఇల్లు తను సంపాదించింది కాదని..ఎవరో రాజకీయ నాయకుడు ఆమెకు గిఫ్ట్ గా ఇచ్చాడు అంటూ వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది. ఈ రూమర్ గురించి రకుల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. హైదరాబాద్లో ఇల్లు ఎవరో నాకు గిఫ్ట్ ఇచ్చారన్న వార్త చూసి మా నాన్న చాలా కోపం తెచ్చుకున్నారు..
నిజానికి ఆ ఇంటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పనులన్నీ నేనే దగ్గర ఉండి చూసుకున్నా. అలాంటిది..ఆ ఇల్లు సొంతం కాదని..ఎవరో గిఫ్ట్ గా ఇచ్చారంటూ వార్త చూడగానే నాన్న భరించలేకపోయాడు. కోపంతో ఊగిపోయాడు..ఏంటిది..నువ్వు కష్టపడి సంపాదించిన సొమ్మును ఎవరో బహుమతిగా ఇచ్చారని..ఎలా రాస్తారు అంటూ ఫైర్ అయ్యారు. ఇలాంటి పనికిరాని రూమర్లకు అసలు మనం స్పందించాల్సిన అవసరం లేదని నచ్చ చెప్పా ఎలాగోలా ఆయనను కన్విన్స్ చేశా అంటూ రకుల్ వివరించింది..!!