సిద్దు జొన్నలగడ్డ, టాలీవుడ్లోని యువ కథానాయకుడు, తన నటనతోనే కాకుండా మంచి మనసుతో కూడా అందరి గుండెల్లో చోటు సంపాదించాడు. ఇటీవల విడుదలైన జాక్ సినిమా ఆశించిన ఫలితాలను రాబట్టకపోవడంతో, నిర్మాతలకు జరిగిన నష్టంలో తన వంతు బాధ్యతగా సిద్దు అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. తన పారితోషికం నుండి సగం, అంటే 4 కోట్ల రూపాయలను నిర్మాతకు తిరిగి ఇచ్చి, తన పెద్ద మనసును చాటుకున్నాడు. ఈ చర్య సినీ పరిశ్రమలో అరుదైన, ఆదర్శనీయమైన ఉదాహరణగా నిలిచింది.
సిద్దు ఈ విధమైన బాధ్యతాయుతమైన, నీతిగల నిర్ణయంతో నెటిజన్లు, సినీ ప్రముఖులు, అభిమానులు అందరూ ఆశ్చర్యపోయి, అతని మంచితనాన్ని ఆకాశానికెత్తేస్తున్నారు. సోషల్ మీడియాలో సిద్దు గురించి ప్రశంసలు కురుస్తున్నాయి. “సిద్దు లాంటి నటులు నిర్మాతలకు అండగా నిలిస్తే, సినీ పరిశ్రమ మరింత విజయవంతమవుతుంది,” అని అభిమానులు, విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ చర్య సిద్దు జొన్నలగడ్డను కేవలం ఒక నటుడిగా కాక, ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా, సినీ పరిశ్రమకు ఆదర్శంగా నిలిపింది..!!