in

Telugu heroes donates for Flood victims in Telugu states!

తెలుగు రాష్ట్రాల్ని వరదలు అతలాకుతలం చేశాయి. మరీ ముఖ్యంగా విజయవాడ, ఖమ్మంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఓ పక్క ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతూనే ఉంది. ఇలాంటి విపత్తర సమయంలో తెలుగు సినీ ప్రముఖులు రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కి భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు.

ఇప్పటికే జూనియర్ ఎన్టీయార్, పవన్ కళ్యాణ్, అశ్వనీదత్, మహేశ్ బాబు, చిరంజీవి, విశ్వక్ సేన్ ఇలా ఒక్కొక్కరు రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీగా ఆర్థిక సాయం ప్రకటించారు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా విరాళం ప్రకటించారు. ప్రభాస్‌ రూ.2 కోట్లు, అల్లు అర్జున్‌ రూ.కోటి విరాళంగా ఇచ్చారు. ఏపీ, తెలంగాణకు చెరో రూ.కోటి ఇస్తున్నట్లు ప్రభాస్‌ ప్రకటించగా.. చెరో రూ.50 లక్షలు ఇస్తున్నట్లు అల్లు అర్జున్‌ తెలిపారు..!!

Sreeleela To Debut In kollywood With Sivakarthikeyan!

Malayalam actor Nivin Pauly, five others booked for sexual assault