in

Neetu Chandra says she was offered money to become a ‘salaried wife’!

నీతూ చంద్ర.. గోదావరి సినిమాలో హీరో సుమంత్‌ పక్కన అతడి మరదలిగా.. జాంగ్రీ తినాలో, లడ్డు తినాలో అర్థం కానంత అయోమయానికి గురయ్యే అమాయక అమ్మాయి పాత్రలో నటించి అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత కూడా పలు తెలుగు చిత్రాల్లో నటించింది. బాలీవుడ్‌ చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నీతూ చంద్ర.. ఆ తర్వాత ఓ హాలీవుడ్‌ మూవీలో కూడా నటించింది. హిందీలో పలువురు నేషనల్‌ అవార్డ్‌ విన్నర్స్‌ సరసన సినిమాలు చేసింది. ఇన్ని మంచి అవకాశాలు వచ్చినప్పటకి ఆమె కెరీర్‌ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగలేదు. గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంది నీతూ చంద్ర. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్‌ హంగామాతో ముచ్చటించింది నీతూ చంద్ర.. ప్రస్తుతం తన పరిస్థితి, తన లైఫ్‌లో ఎదుర్కొన్న చేదు సంఘటనల గురించి చెప్పుకొచ్చింది..

అక్షయ్‌ కుమార్‌, జాన్‌ అబ్రహం హీరోలుగా వచ్చిన గరం మసాలా చిత్రం ద్వారా బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది నీతూ చంద్ర. ఆ తరువాత వరుస సినిమాలు చేసింది. కానీ గత కొంత కాలం నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఈ క్రమంలో నీతూ చంద్ర మాట్లాడుతూ.. ‘‘13 మంది జాతీయ అవార్డులు గెల్చుకున్న యాక్టర్స్‌తో నటించాను. ఎన్నో పెద్ద సినిమాల్లో యాక్ట్‌ చేశాను. మరి ఈ రోజు నా చేతిలో సినిమాలు లేవు.. డబ్బు లేదు. ఈ రోజు నేను ఇండస్ట్రీలోనే లేను’’ అని ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘నా జీవితం ఎలా ఉందంటే.. విజయవంతంగా రాణించిన ఓ నటి ఓటమిలా ఉంది. ఇదిలా ఉంటే ఓ బడా వ్యాపారవేత్త.. నాతో మాట్లాడుతూ.. నీకు నెలకు 25 లక్షలు ఇస్తాను. జీతం తీసుకునే భార్యగా నాతో ఉండు అన్నాడు. ప్రస్తుతం చేతిలో సినిమాలు లేవు.. డబ్బు లేదు. ఎన్నో సినిమాలు చేశాను.. కానీ ఇప్పుడు ఇండస్ట్రీకి నేను అవసరం లేదనిపిస్తోంది’’ అని చెప్పుకొచ్చింది.

mallika Sherawat Takes A Hit At Deepika’s Intimating scenes!

Rashmika Mandanna In A Sultry Red Dress Poses With Paparazzi!