in

mega movie ‘acharya’ to have voice over by mahesh babu?

పోటీత‌త్వాన్ని ప‌క్క‌న‌పెట్టి ఒక‌రి సినిమాల‌కు మ‌రొక‌రు అండ‌గా నిలుస్తూ స్నేహాన్ని చాటుతున్నారు టాలీవుడ్ స్టార్స్‌.  అగ్ర హీరోల సినిమాల‌కు ఇత‌ర స్టార్స్ వాయిస్  ఓవ‌ర్‌ల‌ను అందించ‌డం, ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొన‌డం, సోష‌ల్ మీడియాలో లో ప్ర‌మోట్ చేస్తూ తామంతా ఒక్క‌టేన‌ని నిరూపించుకుంటున్నారు. చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా న‌టిస్తున్న తాజా చిత్రం ఆచార్య‌. ధ‌ర్మ‌స్థ‌లి  అనే ప్రాంతం నేప‌థ్యంలో జ‌రిగే అన్యాయాలు అక్ర‌మాల‌పై పోరాడే ఇద్ద‌రు న‌క్స‌లైట్ల క‌థ‌తో ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఈ సినిమాను తెర‌కెక్కించారు.

ఏప్రిల్ 29న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకురానున్న‌ది. తాజా స‌మాచారం. ప్ర‌కారం ఈ సినిమాకు మ‌హేష్ బాబు వాయిస్ ఓవ‌ర్ ఇచ్చిన‌ట్లు తెలిసింది.  ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ పాత్ర‌ల‌ను మ‌హేష్ బాబు ప‌రిచ‌యం చేస్తార‌ని చెబుతున్నారు. చిరంజీవి కోరిక మేర‌కు మ‌హేష్ బాబు ఆచార్య‌కు వాయిస్ ఓవ‌ర్ ఇవ్వ‌డానికి అంగీక‌రించిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. బుధ‌వారం  మ‌హేష్ బాబు వాయిస్  ఓవ‌ర్‌ను పూర్తిచేసిన‌ట్లు స‌మాచారం.

చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ పూర్తిస్థాయి నిడివి పాత్ర‌ల్లో తొలిసారి న‌టిస్తున్న సినిమా ఇదే. గ‌తంలో రామ్ చ‌ర‌ణ్ న‌టించిన మ‌గ‌ధీర‌తో పాటు మ‌రికొన్ని సినిమాల్లో చిరంజీవి గెస్ట్‌గా న‌టించారు. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజాహెగ్డే క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై నిరంజ‌న్‌రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో రెజీనా ప్ర‌త్యేక‌గీతంలో న‌టించింది.

Regina Cassandra Latest Photoshoot Stills!

Shraddha Kapoor or Kriti Sanon, who will play Sati?