in

pooja hegde’s tweet on radhe shyam’s result goes viral!

టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్నేళ్లుగా వరుసగా విజయాలను సొంతం చేసుకుంటున్న హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. రాధేశ్యామ్ సినిమాలో పూజా హెగ్డే తన నటనతో అదరగొట్టేశారని ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే అదరగొట్టేశారని ఫ్యాన్స్ చెబుతున్నారు. అయితే రాధేశ్యామ్ రిలీజ్ సందర్భంగా పూజా హెగ్డే చేసిన ట్వీట్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తన అసిస్టెంట్లతో కలిసి దిగిన ఫోటోను పూజా హెగ్డే సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో పాటు..

ఈ ఫోటోలో ఉన్న టీమ్ మెంబర్స్ కు లేని టీమ్ మెంబర్స్ కు తనను జాగ్రత్తగా చూసుకున్నందుకు ధన్యవాదాలు అని తెలిపారు. రాధేశ్యామ్ సినిమా ఫలితం ఎలా ఉన్నా ఈ సినిమా షూట్ సమయంలో తన అసిస్టెంట్లు చేసిన వాటికి కృతజ్ఞతతో ఉంటానని పూజా హెగ్డే చెప్పుకొచ్చారు. రాధేశ్యామ్ ప్రయాణంలో తోడు ఉన్నందుకు ధన్యవాదాలు అని పూజా హెగ్డే తెలిపారు. అయితే పూజా హెగ్డే ట్వీట్ లో రాధేశ్యామ్ రిజల్ట్ ఎలా ఉన్నా అంటూ పోస్ట్ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సినిమా రిలీజ్ కు ముందే పూజా హెగ్డే ఈ ట్వీట్ చేయడం గమనార్హం. రాధేశ్యామ్ సినిమా ప్రేక్షకుల అంచనాలను పూర్తిస్థాయిలో అందుకోలేదనే సంగతి తెలిసిందే. అటు ప్రభాస్ కు ఇటు పూజా హెగ్డేకు, నిర్మాతలకు ఈ సినిమా వల్ల మంచి కంటే నష్టం ఎక్కువగా జరుగుతోందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండటం గమనార్హం. ప్రభాస్ కథల విషయంలో మరింత జాగ్రత్త పడాలని ఫ్యాన్స్ చెబుతున్నారు. పాన్ ఇండియా హీరో అయిన ప్రభాస్ కథల ఎంపికలో పొరపాట్లు చేస్తే నిర్మాతలు భారీ మొత్తంలో నష్టపోవాల్సి వస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Financier files case against Bellamkonda’s family!

Samaram Movie heroine Pragya Nayan latest Stills!