in

i had to sell kidney to buy flight ticket : manchu lakshmi

టీవల ఇన్‌స్టాగ్రామ్‌లో చేతి వేళ్లకి, మోకాలికి గాయలైన వీడియోలను పోస్ట్‌ చేసి అభిమానులకు షాకిచ్చిన ఈ తార తాజాగా మరొక ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌ పెట్టింది. అందులో ‘కిడ్నీలు అమ్ముకోవాల్సి వచ్చింది’ అని రాసుకొచ్చిన వ్యాఖ్యలు నెటిజన్లను ఆశ్చర్యపరిచాయి. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..ఇన్నాళ్లు ఇంట్లోనే గడిపిన మంచు లక్ష్మి ఇప్పుడు ఫారిన్‌ టూర్‌కు వెళుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది.

‘ఇన్ని రోజులు కుటుంబంతో సరదాగా గడిపాను. ఇప్పుడు నా కోసం కొంచెం సమయం కేటాయించాలనుకుంటున్నాను. అందుకే ఒంటరిగా ఫారిన్‌ టూర్‌కు వెళుతున్నాను’ అని ట్వీట్‌ చేసిన ఆమె మరో ట్వీట్‌లో ‘ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌లో ఆకలి వేయకపోయినా తిన్నాను. ఎందుకంటే ఆ టికెట్‌ కొనుగోలు చేయడానికి నా కిడ్నీ అమ్ముకోవాల్సి వచ్చింది.

అందుకే ఆ టికెట్‌ డబ్బులకు న్యాయం చేసేందుకు అలా ఆకలి కాకపోయినా తింటున్నా’ అని  విమాన టికెట్ల ధరలపై  సటైరికల్‌గా రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌ చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ‘అక్కా..నువ్వు కూడా మా బ్యాచేనా’ అని కొందరు కామెంట్ చేయగా.. ‘మీరు పూర్‌ ఏంటి? చాలా రిచ్‌ కదా’ అని మరికొందరు స్పందించారు. దీనికి స్పందించిన లక్ష్మి ‘మా నాన్న రిచ్‌ తమ్ముడు.. నేను కాదు’ అంటూ సటైరికల్‌ రిప్లై ఇచ్చింది.

sukumar revealed Allu Arjun And Fahadh Were Supposed To Go Nude!

Trisha Latest Spicy Stills in White Dress!