
తాప్సీ ఎపిసోడ్ ముగిసింది అనుకుంటే తాజాగా గోవా బ్యూటీ ఇలియానా ఇదే తీరుగా ఆరోపించింది. అయితే ఇలియానా మాత్రం టాలీవుడ్ లో నెపోటిజం అన్న టాపిక్ పై ముచ్చటిస్తూ నోరు జారి బుక్కయ్యింది. ఇంతకీ ఇలియానా ఏమంది? అంటే.. టాలీవుడ్ మొత్తం నేపోటిజంపైనే రన్ అవుతుంది అంటూ ఘాటైన విమర్శనే చేసింది. కొత్త వాళ్లు టాలీవుడ్ లో ఎదగడం చాలా కష్టం అనేసింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆకస్మిక మరణం అనంతరం నెపోటిజం పెద్ద డిబేట్ అయ్యింది. ఆ క్రమంలోనే ఇంటర్వ్యూలో ఇలియానా ఇలాంటి ఊహించని కామెంట్ చేసింది.

