in

UPASANA’S QUARANTINE GOAL!

పాసన కొణిదెల.. రామ్ చరణ్ భార్యగా, మెగాస్టార్ కోడలిగానే కాకుండా తనకంటూ ప్రత్యేకంగా ఓ ఇమేజ్ సంపాదించుకుంది. అనేక సామాజిక అంశాల పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటుంది. కరోనా విషయంలో కూడా నెటిజన్స్‌కు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు చేస్తుంటుంది. తాజాగా మెగా ఫ్యామిలీతో కూడా కలిసి కరోనా వైరస్ పై చేసిన ప్రకటనలో చెర్రీతో కలిసి పాల్గొంది. ఇప్పుడు ఉపాసన మరో ట్వీట్ చేసింది. 5 నిమిషాల పాటు ఇలా కూర్చోగలరా ? అంటూ నెటిజన్స్‌కు కొత్త పరీక్ష పెట్టింది. ‘నగరంలో నివసించే చాలామంది ప్రజలకు ఈ స్థితిలో కూర్చోవడానికి కష్టపడతారు. ఇది చాలా కఠినంగా ఉంది’ అంటూ ఉపాసన ట్వీట్ చేసింది.

ఇలా కూర్చోవడం చూసే వారికి చాలా ఈజీగా కనిపిస్తుంది కానీ అలా కూర్చోవడం చాలా కష్టం, హైదరాబాద్ లో చాలా మంది ఇలా కూర్చోవడానికి కష్ట పడతారని ఆమె పేర్కొంది. ఇండియన్ టాయిలెట్ పొజిషన్ లో మీరు కనీసం 5 నిమిషాలైనా కూర్చోగలరా ? అని నెటిజన్లను ప్రశ్నించారు. నిజానికి ఇలా కూర్చోవటం వల్ల ఆరోగ్యకరైన ప్రయోజనాలు కూడా ఉంటాయని తెలిపారు. మే 3 తర్వాత ప్రతిరోజూ తాను కూడా ఇలాంటి వ్యామాయం చేసేందుకు ట్రై చేస్తానని ట్వీట్ చేసింది.

WHAT’S HAPPENING WITH SWATHI?

SNEHITHUDI MEESAM POKUNDA KAAPADINA CHIRANJEEVI!