in

100 Crores More To Be Spent on Improving VFX Of adipurush?

ప్రభాస్‌ ఆదిపురుష్‌ మూవీ పాజిటివ్‌ కంటే నెగటివ్‌గానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఎప్పుడైతే ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌, టీజర్‌ రిలీజ్‌ అయ్యాయో అప్పటి నుంచే ట్రోల్స్‌ మొదలయ్యాయి. ఇందులో వాడిన వీఎఫ్ఎక్స్‌, రావణుడి క్యారెక్టర్‌ను చూపించిన తీరుపై నెటిజన్లు పెదవి విరిచారు. వందల కోట్ల బడ్జెట్‌, సుదీర్ఘ కాలం షూటింగ్‌ చేసిన ఈ మూవీ టీజర్‌ మరీ ఇంత చెత్తగా ఉందేంటంటూ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు..ఈ టీజర్‌పై విపరీతమైన ట్రోల్స్‌ రావడంతో మేకర్స్‌ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు.

ఇందులో కొన్ని వీఎఫ్‌ఎక్స్‌ను మార్చనున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా మూవీ రిలీజ్‌ను వాయిదా వేసినట్లు ప్రకటించిన మరుసటి రోజే ఆదిపురుష్‌ బడ్జెట్‌ను రూ.100 కోట్ల మేర పెంచనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మూవీలో మరీ నాసిరకంగా ఉన్న వీఎఫ్‌ఎక్స్‌ను మెరుగు పరచడంపై దృష్టిసారించాలని నిర్ణయించారు. టీజర్‌ చూసిన తర్వాత అసలు ఇందులో నటించింది అసలు ప్రభాసేనా లేక కంప్యూటర్‌ జనరేటెడ్‌ వ్యక్తా అన్న సందేహాలు కూడా వ్యక్తం చేశారు. మరీ కార్టూన్‌ సినిమా చూసినట్లు ఉందనీ కామెంట్లు చేశారు..!!

Rashmika about trolls, says ‘it’s heartbreaking and demoralizing’!

sreemukhi’s recreation Gangubai Kathiawadi is a must watch!