in

yevari sandhya raju ?

సినీ వినీలాకాసం లో మెరిసిన ఒక కొత్త మెరుపు సంధ్య రాజు, ” ఒక్క చాన్సు” అంటూ సినిమా లోకి వచ్చిన నటి కాదు ఈవిడ. ప్రముఖ కూచిపూడి నాట్యకారిణి, నిశృంఖలా డాన్స్ అకాడమీ వ్యవస్థాపకురాలు. ఆమె నటిస్తూ నిర్మిస్తున్న చిత్రమే ” నాట్యం”. పూర్తిస్థాయి నాట్య ప్రధానమయిన చిత్రం, సాగర సంగమం తరువాత పూర్తి స్థాయి నాట్యప్రధానమయిన చిత్రం ఇదే అని చెప్ప వచ్చు.” నాట్యం” సినిమా టీజర్ జూనియర్ యెన్.టి.ఆర్. చేతుల మీదుగా రిలీజ్ అయింది, సినిమాలోని ఒక పాటను నందమూరి బాల కృష్ణ విడుదల చేసారు. అందుకే , అందులోని హీరోయిన్ ఎవరబ్బా అని అందరు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇంతకీ సంధ్య రాజు ఎవరు?గతంలో ఏ తెలుగు సినిమాలోనూ కనిపించని ఇమే ఎవరు ?

వేల కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీలకు వారసురాలు, రాంకో సిమెంట్ ఇండస్ట్రీస్ యజమాని అయిన పి.ఆర్.వెంకట రామ రాజు గారి పెద్ద కుమార్తె ఈ సంధ్య రాజు. కూచిపూడి నాట్యాచార్యుడు వెంపటి చిన సత్యం గారి శిష్యురాలు ఈ సంధ్య రాజు. కూచిపూడి నాట్యం యొక్క ప్రాముఖ్యతనుఁ చాటి చెప్పేందుకే ఆమె ఈ చిత్ర నిర్మాణం తలపెట్టారు. ఇంకొక ఆసక్తికరం అయిన విషయం ఏమిటంటే, ఐ.టి. పరిశ్రమ మన తెలుగు నెల మీద వేళ్లూనుకోవటానికి కారకులయిన మన సత్యం రామలింగ రాజు గారి కోడలు ఈమె. ఎంతో ఉన్నతమయిన ఆశయం తో ఆమె నిర్మిస్తున్న “నాట్యం” చిత్రం విజయవంతం కావాలని కోరుకుందాం. ఆమె కీర్తి దశ దిశలా వ్యాపించాలని ఆశీర్వదిద్దాం.

raai laxmi’s awesome us trip photos!

Nagababu reveals whom he is supporting this season!