in

‘Who killed Kattappa? rgv satires on government again!

గన్‌ సర్కార్‌, టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమకు మధ్య టికెట్ల ధరల వివాదం చెలరేగుతూనే ఉంది. అయితే.. తాజాగా జగన్‌ సర్కార్‌ పై మరో సంచలన ట్వీట్‌ చేశారు రామ్‌ గోపాల్‌ వర్మ. కట్టప్పను ఎవరు చంపారు ? అంటూ జగన్‌ సర్కార్‌ పై మండిపడ్డారు వర్మ. రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ టిక్కెట్ ధర రూ. 2200/-కి మహారాష్ట్రలో అనుమతి ఇచ్చారని….. ఉత్తరాది రాష్ట్రాల్లో ఐనాక్స్ చిహ్న మల్టీప్లెక్స్ చైన్ ఆర్‌ఆర్‌ఆర్‌ టిక్కెట్లను రూ. 2200కి విక్రయిస్తోందన్నారు.

కానీ సొంత రాష్ట్రం ఏపీలో టికెట్లను రూ. 200/-కి విక్రయించడానికి కూడా అనుమతించకపోవడం ఒక ప్రశ్నను లేవనెత్తుతుందని… “కట్టప్పను ఎవరు చంపారు? ” అంటూ ఆర్జీవీ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌ గా మారింది. కాగా… నిన్న ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో దర్శకుడు ఆర్జీవీ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సినిమా టికెట్ల ధరలపైనే వీరిద్దరూ చర్చించారు. కానీ.. ఈ వివాదానికి ఇంకా ఫుల్‌ స్టాప్‌ పడలేదు. ఇంకా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది.

zombie reddy girl Daksha Nagarkar turns villain for ravi teja!!

Amala Paul Stills at a Movie Press Meet!