in

Vijay Deverakonda to treat fans with exciting update!

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అలానే టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా లైగర్. ఈ సినిమాతో విజ‌య్ దేవ‌ర‌కొండ పాన్ ఇండియా హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుండటం.. అలానే క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ఆగష్ట్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమా రిలీజ్ కు ఇంకా చాలా టైముంది. అందుకే చిత్రయూనిట్ కూడా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది కానీ ఈసినిమా ప్రమోషన్స్ పై ఇంకా ఫోకస్ పెట్టడంలేదు. ఆ

మధ్య వరుసగా ఒక రెండు మూడు అప్ డేట్స్ ఇచ్చి ఫ్యాన్స్ ను ఖుషీ చేశారు. కానీ ఈమధ్య ఒక్క అప్ డేట్ కూడా ఇవ్వడం లేదు మేకర్స్. మరోవైపు విజయ్ కూడా వేరే సినిమాల షూటింగ్ లలో కూడా పాల్గొంటున్నాడు.. పూరీ కూడా విజయ్ తో తను చేయబోయే రెండో సినిమా పనిలో పడిపోయాడు. దీంతో లైగర్ సినిమా నుండి అప్ డేట్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ కూడా ఎదురుచూపులు చూస్తున్నారు. ఇక ఎలాగొలా నేడు తాజాగా ఈసినిమా నుండి ఒక అప్ డేట్ తో వచ్చేశారు. అతను హంగ్రీ, ఇండియా హంగ్రీ అంటూ మే 9 సాయంత్రం 4 గంటలకు అప్ డేట్ ఇవ్వనున్నట్టు తెలిపారు. అయితే అది ఏ అప్ డేట్ ఇస్తారన్న విషయంమాత్రం చెప్పలేదు.

Kajal agarwal Ready To Quit Films For Husband!

11 years for ‘100% love’!