యానిమల్’ తో రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోయిన త్రిప్తి డిమ్రి ఇప్పుడు జాక్పాట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఏకంగా ప్రభాస్ సరసన ‘స్పిరిట్’ లో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాకు డైరెక్టర్ ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగ. ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో ఈ న్యూస్ చెప్పడం జరిగింది.దీపికా పదుకొణె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుందని వార్తలు వచ్చాక త్రిప్తి పేరు అనౌన్స్ చేశాడు సందీప్.
ఇప్పుడు త్రిప్తి అయితే ఫుల్ ఖుషీలో ఉంది. ఇక ఆమె రెమ్యూనరేషన్ విషయానికి వస్తే, ఈ సినిమా కోసం త్రిప్తికి అక్షరాలా 4 కోట్ల పారితోషికం ఆఫర్ చేశారట. ‘యానిమల్’ సినిమాకు త్రిప్తి అందుకుంది 50 లక్షలే. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 రెట్లు పెరిగిపోయింది తన రేంజ్. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు, ‘యానిమల్’ తర్వాత ఆమె మార్కెట్ ఎంతలా పెరిగిపోయిందో.ఇక దీపిక ఎందుకు తప్పుకుందంటే రెమ్యునరేషన్, కాల్షీట్ల విషయంలో తేడాలు వచ్చాయనేది అందరికీ తెలిసిన సంగతే..!!