ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘స్పిరిట్’ మూవీ స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తి కాగా, ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు దర్శకుడు సందీప్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ మూవీలో ప్రభాస్ సరసన నటించే కథానాయిక ఎవరా అని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పలువురు బాలీవుడ్ అగ్ర కథానాయికల పేర్లు వినిపించాయి. అయితే, ఆ ఊహాగానాలకు తెర దించుతూ ఈ మూవీలో కథానాయికగా నటించే అవకాశాన్ని త్రిప్తి డిమ్రీ దక్కించుకుంది. దర్శకుడు సందీప్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు.
‘స్పిరిట్’ ప్రాజెక్టులో నటీనటులకు సంబంధించి ప్రభాస్ తర్వాత వచ్చిన అధికారిక ప్రకటన ఇదే. దాదాపు తొమ్మిది భాషల్లో ఈ మూవీని తీర్చిదిద్దనున్నట్లు తాజా ప్రకటనను బట్టి తెలుస్తోంది. త్రిప్తి డిమ్రీ పేరును తెలుగుతో పాటు ఇంగ్లిష్, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్లో రాశారు. పాన్ వరల్డ్ మూవీగా ‘స్పిరిట్’ను తీర్చిదిద్దనున్నట్లు ఈ ప్రకటనను బట్టి అర్థమవుతోంది. కథానాయికగా ఎంపికైన త్రిప్తి స్పందిస్తూ దర్శకుడు సందీప్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపింది..!!