in

Tillu Square: Anupama Out, Madonna sebastian in!

సిద్దు జొన్నలగడ్డను స్టార్ బాయ్ గా మార్చిన సినిమా ‘డిజె టిల్లు’. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిన్న సినిమా భారీ విజయాన్ని అందుకుంది. టాలీవుడ్ లో ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఈ సినిమాకు సిద్దు జొన్నలగడ్డ కథ అందించగా, విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. నేహా శెట్టి హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దీనికి సీక్వెల్ ను కూడా ప్రకటించారు. దీపావళికి సీక్వెల్ టైటిల్ ను ప్రకటించారు. ‘టిల్లు స్క్వేర్’ అని సీక్వెల్ కు టైటిల్ పెట్టరు..

‘టిల్లు స్క్వేర్’ లో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటించనుందని ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. త్వరలోనే షూటింగ్ కూడా మొదలవుతుందని అన్నారు. కానీ, ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న తాజా సమాచారం ప్రకారం అనుపమ పరమేశ్వరన్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. కారణాలు ఏంటో స్పష్టంగా తెలియదు కానీ, ఈ సినిమా నుంచి అనుపమ తప్పుకున్నారని కన్ఫర్మ్ చేస్తున్నారు. అనుపమ స్థానంలో మడోన్నా సెబాస్టియన్ ను ఖరారు చేశారని సమాచారం..!!

trivikram adds more glamour to mahesh babu’s next!

Janhvi Kapoor trying hard to bag ram charan’s next?