in

telugu heroine shivathmika rajashekar signs her next in kollywood!

దొరసాని’ చిత్రంలో సహజ నటనతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది రాజశేఖర్‌ తనయ శివాత్మిక.. గౌతమ్‌కార్తిక్‌ హీరోగా నటిస్తున్న ‘ఆనందం విలయాడుమ్‌ వీడు’ సినిమా ద్వారా ఈ ఏడాది కోలీవుడ్‌లో అరంగేట్రం చేయబోతున్నది శివాత్మిక. మొదటి సినిమా విడుదలకాకముందే తమిళంలో మరో చిత్రాన్ని అంగీకరించింది. అశోక్‌ సెల్వన్‌ హీరోగా ఆర్‌ కార్తిక్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రేమకథా చిత్రంలో శివాత్మిక కథానాయికగా నటించనున్నది.

ఆమెతో పాటు రీతూవర్మ, అపర్ణబాలమురళి ఈ సినిమాలో హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. రోడ్‌జర్నీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో విలక్షణమైన పాత్రలో శివాత్మిక కనిపించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ‘నా కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోయే చిత్రమిది. ప్రతిభావంతులైన టీమ్‌తో కలిసి పనిచేసే సమయం కోసం ఉత్సుకతగా ఎదురుచూస్తున్నా’ అని శివాత్మిక ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నది. ఈ సినిమాలో ఇద్దరు తెలుగు హీరోయిన్లు నటించనుండటం గమనార్హం..

keerthy suresh yoga practice at home!

heroine Namitha turns producer with ‘Bow Wow’!