in

singer sunitha request to ktr!

బాలీవుడ్ మొత్తాన్ని భయబ్రాంతులకు గురిచేసిన ప్రముఖ సింగర్ కనికా కపూర్ గురించి తెలిసే ఉంటుంది. మార్చి 11 న లండన్ నుంచి లక్నో చేరుకున్న కనికా కపూర్ కి కరోనా పాజిటివ్ లక్షణాలు కనబడడంతో.. నిబంధనల ప్రకారం స్వయంగా ఐసోలేషన్ కి వెళ్లాల్సిందిగా అధికారులు ఆమెకు సూచించారు. అయితే ఆ సలహాను పక్కనబెట్టిన ఆమె.. తన సొంత కార్యక్రమాల్లో నిమగ్నమైంది. ఆమె ఇఛ్చిన డిన్నర్ కి అనేక మంది బడా పొలిటిషియన్లు, సెలబ్రిటీలు హాజరైన సంగతి తెలిసిందే.. వీరిలో బీజేపీ నేత, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరా రాజే సింధియా, ఆమె కుమారుడు దుశ్యంత్ సింగ్ కూడా ఉన్నారు.
ఇదిలా ఉంటే ఈ వార్తను ఓ ఫెస్ బుక్ పేజ్ ‘ప్రముఖ సింగర్ కు కరోనా ఆసుపత్రికి తరలింపు’ అని రాసి టాలీవుడ్ సింగర్ సునీత ఫోటోను పోస్ట్ చేశారు. దాంతో ఆమె దీనిపై యాక్షన్ తీసుకోవాలని తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు రిక్వెస్ట్ చేశారుఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేసిన సునీత.. ‘చందమామ కథలు అనే ఓ ఫేస్‌బుక్‌ పేజీ సింగర్ కనికా కపూర్‌కు కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పే వార్తకు నా ఫొటోను థంబ్‌నైల్ పెట్టారు. ఇది చాలా ఇబ్బందికి గురిచేసింది. సంబంధిత అధికారులు దీనిపై యాక్షన్ తీసుకోవాలని విఙ్ఞప్తి చేస్తున్నా. నేను బావున్నా’ అని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌కు తెలంగాణ డీజీపీ, మంత్రి కేటీఆర్, తెలంగాణ సీఎంఓ, తెలంగాణ పోలీసులను ఆమె ట్యాగ్ చేశారు.

MIND-BLOWING LOOKS OF ANASUYA !

ala coffee manesina andhala natudu!