in

shocking: Rajinikanth’s daughter aishwarya’s Gold Ornaments Stolen!

సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్..నటుడు ధనుష్‌ ను వివాహం చేసుకుని 18 సంవత్సరాలు తరువాత 2022లో అతని నుండి విడిపోయారు. ప్రస్తుతం ఆమె చెన్నైలోని తేనాంపేటలోని సెయింట్ మేరీస్ రోడ్‌ లోని తన నివాసంలో నివసిస్తోంది. తన ఇంట్లోని లాకర్‌లో సుమారు 60 సవర్ల నగలు మాయమైనట్లు ఫిబ్రవరి 27న తేనాంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఐశ్వర్య, తన వద్ద పనిచేస్తున్న ముగ్గురు సిబ్బందిని కూడా అనుమానితులుగా పేర్కొంది మరియు ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 2019లో సోదరి సౌందర్య రజనీకాంత్ పెళ్లికి ధరించి విలువైన వస్తువులను లాకర్‌లో ఉంచినట్లు ఐశ్వర్య రజనీకాంత్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

మూడుసార్లు ఇళ్లు మారిన తర్వాత కూడా ఆమె గత నాలుగేళ్లుగా ఆ నగలను బయటకు తీయలేదు. చెన్నైలోని సెయింట్ మేరీస్‌ రోడ్‌లోని ఇల్లు, ధనుష్‌కు చెందిన సీఐటీ నగర్‌ ఇల్లు, పోయెస్‌ గార్డెన్‌లోని రజనీ ఇంట్లో లాకర్లను మార్చుకుని ఉంచినట్లు సమాచారం. లాకర్‌లోని నగలు మాత్రమే కాకుండా తాళాలు ఎక్కడ భద్రపరిచారనే విషయం కూడా ఇంట్లో పనిచేస్తున్న ముగ్గురు పనివాళ్లకు తెలుసని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓ వీవీఐపీ నివాసంలో జరిగిన దొంగతనానికి సంబంధించిన నివేదికలు నెటిజన్లను షాక్‌కి గురిచేశాయి..మరి పోలీసులు ఎంత త్వరగా దొంగను పట్టుకుంటారు వేచి చూడాలి..!!

akkineni SUSHANTH IN CHIRANJEEVI’S NEXT!

‘Ravanasura’ will surprise you, says husharu girl Daksha nagarkar!