in

sethupathi and shruthi said no to balayya’s film!

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం కుర్ర హీరోల‌తో పోటీ ప‌డుతూ సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం బోయ‌పాటి శీను తెర‌కెక్కిస్తున్న అఖండ చిత్రంతో బిజీగా ఉండ‌గా, ఈ సినిమా త‌ర్వాత గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ చేయ‌నున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్ర‌క‌ట‌న ఇప్ప‌టికే రాగా,ఇందులో న‌టించే ఆర్టిస్టుల‌కి సంబంధించిన ఎంపిక జ‌రుగుతుంది.

చిత్రంలో బాలయ్యతో తలపడేందుకు పవర్‌ ఫుల్‌ విలన్‌ క్యారెక్టర్‌ను రూపొందించాడు డైరెక్టర్‌. ఇందుకోసం గోపీచంద్ మలినేని తమిళ స్టార్‌ హీరో విజయ్ సేతుపతి పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల ఆయ‌న‌తో సంప్ర‌దింపులు కూడా జ‌రిపాడ‌ట‌. అయితే ఆయ‌న విల‌న్ పాత్ర‌కు సున్నితంగా నో చెప్పిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు క‌థానాయిక‌గా శృతి హాస‌న్‌ని సంప్ర‌దించ‌గా, ఆమె కూడా నో అని చెప్పేసింద‌ట‌.

గోపిచంద్ మ‌లినేనితో శృతి గ‌తంలో ప‌ని చేయ‌గా, ఆ గౌర‌వంతో అతిథి పాత్ర‌కు ఓకే చెప్పింద‌ట‌. మ‌రి హీరోయిన్‌గా ఎవ‌రిని ఎంపిక చేస్తారు అనే దానిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. త్రిష లేదా మెహ్రీన్‌ల‌లో ఒక‌రిని హీరోయిన్‌గా ఎంపిక చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది. కాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. ఎస్‌ఎస్‌ తమన్‌ స్వరాలు సమకుర్చనున్నాడు. త్వరలోనే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది.

Ananya Nagalla looks Stunning in blue Half Saree!

Kanabadutaledu!