విడాకుల తర్వాత నాగచైతన్య, సమంతలు కలవడం గానీ, మాట్లాడుకోవడం గానీ జరగలేదు. ఎవరి జీవితం వారు కొనసాగిస్తున్నారు. సమంత నుంచి విడిపోయిన తర్వాత నాగ చైతన్య శోభిత ధూళిపాళను వివాహం చేసుకోగా, సమంత రాజ్ నిడిమోరుతో డేటింగ్ లో ఉన్నట్లుగా సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ‘ఏమాయ చేశావె’ సినిమా రీ-రిలీజ్ నేపథ్యంలో ఇన్నాళ్లకు సమంత, నాగ చైతన్య కలవబోతున్నారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘ఏమాయ చేశావె’ సినిమా సందర్భంలోనే వీరు ప్రేమలో పడినట్లు సమాచారం. ఈ చిత్రం ఇద్దరికీ చాలా ప్రత్యేకమైనది కావడంతో రీ-రిలీజ్ అవుతున్న సందర్భంగా వారు కలిసి ప్రమోట్ చేస్తే బాగుంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే దాదాపు వీరిద్దరూ కలిసే అవకాశం లేదనే మాటలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ సినిమా ద్వారా సమంత, చైతన్యలను మళ్లీ ఒకే స్క్రీన్ పై చూసే అవకాశం లభిస్తుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..!!