in

samantha gives a fair warning to her haters!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది ఎప్పటికప్పుడు పోస్టులు షేర్ చేస్తూ.. అభిమానులకు దగ్గరవుతుంటుంది. అయితే, తాజాగా సమంత పెట్టిన వరుస పోస్టులు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. అయితే, సామ్ ఎవరిని ఉద్దేశించి ఈ పోస్టులు చేసిందో తెలియదు కానీ, గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. సమంత-నాగ చైతన్య విడాకుల తర్వాత అనేక పరిణామాలు సంభవించాయి. సమంత ఫ్యాన్స్ నాగ చైతన్యను తప్పుబడితే.. చైతూ ఫ్యాన్స్ సమంతను ఆడిపోసుకున్నారు. ఈ క్రమంలో ఇటీవల సమంతపై ట్రోల్స్ ఎక్కువయ్యాయి.

ఈ నేపథ్యంలోనే సమంత ఈ పోస్టుతో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ‘నా మౌనం అజ్ఞానం అని, నా సైలెన్స్ అన్నిటికి అంగీకరిస్తున్నానని, నా దయని బలహీనత అని అనుకోకండి. దయాగుణానికి కూడా ఓ చివరి డేట్ ఉంటుంది. జస్ట్ చెప్తున్నాను అంతే’ అంటూ కాస్త సీరియస్‌గానే ట్వీట్ చేసింది సమంత. అయితే, సామ్ ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేసింది..? అనేది సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. సమంత ఫ్యాన్స్‌‌కు, అక్కినేని ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తోంది. అందుకే సమంత ఇలాంటి పోస్టులు పెడుతుందని అంటున్నారు నెటిజన్లు.

A hero wants to meet me alone: Isha Koppikar

used to clean the dirty floor in the studio : Raveena Tandon