in

sai pallavi turns chiranjeevi’s sister!

మెగాస్టార చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని ఇది చిరంజీవికి 152వ చిత్రం కావడం విశేషం.. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో చిరు సరసన కాజల్ అగర్వాల్ కథానాయకగా నటిస్తోంది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం వలన సినిమా వాయిదా పడింది. అయితే ఈ సినిమా తరవాత వరుసపెట్టి సినిమాలను చేసేందుకు చిరు రెడీ అవుతున్నారు.. ఇప్పటికే లూసిఫర్ రీమేక్ హక్కులను తీసుకున్న చిరు ఈ కథకి సంబంధించిన మార్పులను చేస్తున్నారు.

అంతేకాకుండా తమిళ్ లో అజిత్ నటించిన ‘వేదాళం’ రీమేక్‌లో నటిస్తున్నారు. దీనిని మెహర్ రమేష్ దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం నటి సాయి పల్లవిని సంప్రదిస్తున్నారని సమాచారం..తమిళ వేదాళంలో అజిత్‌ చెల్లిగా లక్ష్మీమీనన్‌ నటించింది. ఆమె పాత్రకి మంచి పేరు వచ్చింది అక్కడ.. ఇప్పుడు ఆ పాత్రకి సాయి పల్లవి అయితే సరిగ్గా సరిపోతుందని మేకర్స్ భావిస్తున్నారట మేకర్స్..

release date fixed for anushka’s ‘nishabdam’!

pooja hegde said no to ravi teja movie?