in

regina and nivetha in telugu remake of ‘Midnight Runners’!

యంగ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. కొరియన్‌ భాషలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘మిడ్‌ నైట్‌ రన్నర్స్‌’ సినిమాను తెలుగులో నివేథా థామస్, రెజీనాలతో రీమేక్‌ చేస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో నివేథా, రెజీనా పాత్రలు వైవిధ్యంగా ఉంటాయని సమాచారం. కరోనా మహమ్మారి సాధారణ పరిస్థితికి వచ్చాక ఈ ఏడాది ద్వితీయార్థంలో సినిమాను విడుదల చేస్తారని సమాచారం.

ఇక ఈ సినిమాకి ప్రస్తుతం శాకినీ-ఢాకినీ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంకా అధికారకంగా ఈ టైటిల్ కన్‌ఫర్మ్ కాలేదు. నివేథా థామస్ రీసెంట్‌గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ లో కీలక పాత్రలో కనిపించి మెప్పించింది. ఇక రెజీనా ఎవరు సినిమా తర్వాత మళ్ళీ తెలుగు సినిమాలో కనిపించలేదు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతోంది.

uppena beauty reveals her wish and joins the list!

after samantha, its naga chaithanya now enters in ott!