in

rashmika mandhanna confirms her bollywood entry!

సౌత్ బ్యూటీ, టాలీవుడ్‌లో అచిరకాలంలోనే అగ్రశ్రేణి తారగా పేరు తెచ్చుకున్న రష్మికా మందన్న బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ‘మిషన్ మజ్ను’ మూవీలో ఆమె నాయికగా ఎంపికయ్యారు. ఈ బిగ్ ఫిల్మ్‌లో భాగం కావడంతో ఆమె ఎగ్జయిట్ అవుతున్నారు. తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఆమె ఈ న్యూస్‌ను షేర్ చేసుకున్నారు. “Well guys, here’s news for you! I’m super glad and excited to be a part of this! Here’s to a new journey!”

అని ఆమె ట్వీట్ చేశారు. సిద్ధార్థ్ మల్హోత్రా ఉన్న ‘మిషన్ మజ్ను’ పోస్టర్‌ను షేర్ చేసిన ఆమె “Inspired by real events, the story of India’s most daring RAW mission inside Pakistan! #MissionMajnu” అంటూ రాసుకొచ్చారు. శంతను బాగ్చి డైరెక్టర్‌గా పరిచయమవుతున్న ఈ మూవీలో సిద్ధార్థ్ మల్హోత్రా రా ఏజెంట్‌గా నటిస్తున్నారు. పర్వీజ్ షేక్‌, అసీమ్ అరోరా, సుమిత్ బతేజా రచన చేస్తున్న ‘మిషన్ మజ్ను’ను గూల్టీ, ఆర్ఎస్‌వీపీ బ్యానర్లపై అమర్ బుటాలా, గరిమా మెహతా, రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్నారు..

senior actress annapurna about casting couch in film industry!

Amala Paul’s high budget web series series for ‘Aha’!