in

Rashmika Mandanna to promote cyber safety as ambassador!

ప్రముఖ కథానాయిక రష్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో కూడా అగ్రహీరోయిన్ల జాబితాలో ఉంది. సినిమాలతో పాటు పలు సామాజిక సేవ కార్యక్రమాల్లోనూ పాల్గొనే ఈ కథానాయికను ఓ అరుదైన గౌరవం వరించింది. కేంద్ర ప్రభుత్వ హోంశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ వింగ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా రష్మికను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా ద్వారా తెలియజేస్తూ, తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. తనకు ఇలాంటి గౌరవం, బాధ్యతను అప్పజెప్పిన కేంద్ర హోంశాఖకు రష్మిక తన ధన్యవాదాలు తెలియజేసింది..!!

Mammootty To Play Prabhas’ Father In Sandeep Reddy Spirit?

telugu actress Ananya Nagalla Fired on Trollers!