in

rashmi gautham demands justice for bruno dog!

తిరువనంతపురం బీచ్ లో ముగ్గురు వ్యక్తులు కుక్కని కర్రలతో చావబాది చంపేశారు. ఆపై చేపల గాలానికి వేలాడదీశారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న వారి హృదయం చలించక మానదు. దీనితో నిందితులని కఠినంగా శిక్షించాలి అంటూ సోషల్ మీడియాలో ‘జస్టిస్ ఫర్ బ్రూనో’ అంటూ ట్రెండ్ మొదలైంది. టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ కి జంతువులంటే విపరీతమైన ప్రేమ. రష్మీ గౌతమ్ తరచుగా జంతువులకు ఆహారం అందిస్తున్న దృశ్యాలు చూస్తూనే ఉన్నాం. ఈ సంఘటనపై రష్మీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

‘ఇలాంటి సంఘటనలు చూస్తుంటే మనుషులపైనే సిగ్గుగా అనిపిస్తుంది. మనుషులు ఇలా ఉన్నప్పుడు కరోనా రావడంలో తప్పులేదు అనిపిస్తుంది. బ్రూనో ఏంపాపం చేసింది.. మీకు ఏం అన్యాయం చేసింది అంటూ రష్మీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. 100 శాతం అక్షరాస్యత అని చెప్పుకునే రాష్ట్రంలో ఇలాంటి సంఘటన జరగడమా.. అక్కడ ఏనుగులని బాగా మేపుతారు..కానీ కుక్కలని మాత్రం ఇలా హిసించి చంపుతారా అంటూ రష్మీ మండిపడింది. ఈ కిరాతక ఘటనలో కేరళ హైకోర్టు అభినందించదగ్గ నిర్ణయం తీసుకుంది. కేసుని సుమోటోగా తీసుకుని నేరగాళ్ల భరతం పట్టాలని డిసైడ్ అయింది.

HEROINE PRAGYA JAISWAL CROWDED BY BEGGARS!

Anchor Varshini’s adorable Photoshoot!