in

Rajinikanth to be honoured with 51st Dadasaheb Phalke Award!

సినీ రంగంలో అత్యున్న‌త పుర‌స్కారంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్‌ను 2019కి గాను ర‌జ‌నీకాంత్ అందుకోనున్నారు. ఈ విష‌యాన్ని కేంద్రమంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌డేక‌ర్ కొద్ది సేప‌టి క్రితం ప్ర‌క‌టించారు. 51వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ అందుకోనున్న‌ట్టు ఆయ‌న తెలియ‌జేశారు. 1969 నుండి ఈ అవార్డుల‌ని ప్ర‌క‌టిస్తుండ‌గా, ఇప్పటి వరకు 50 మంది ఈ అత్యున్నత పుర‌స్కారాన్ని అందుకోగా, ఈ అవార్డు అందుకున్న 50వ వ్యక్తి అమితాబ్ బచ్చన్.

హిందీ చిత్ర సీమ నుండి 32 మంది దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. మిగతా 18 మంది ఇత‌ర భాష‌ల నుండి ఎంపికయ్యారు. 2018కి గాను బిగ్‌బీ  66వ జాతీయ చలన చిత్రాల పురస్కారాల్లో భాగంగా అత్యున్నత సినీ జీవిత సాఫల్య పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందు‌కున్నారు. కాగా, త‌మిళ‌నాడు ఎన్నికలు ఏప్రిల్‌ 6న జ‌ర‌గ‌నుండ‌గా, ఎల‌క్ష‌న్స్ ముందు కేంద్రం ఈ అవార్డ్ ప్ర‌క‌టించ‌డం చర్చ‌నీయాంశంగా మారింది. ర‌జ‌నీకాంత్ 2000లో ప‌ద్మ‌భూషణ్‌, 2016లో ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారాలు అందుకున్న విష‌యం తెలిసిందే.

One More Record In tollywood beauty Samantha’s Account!

Hero Kartikeya asks for another chance!