తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..సుకుమార్ టాలీవుడ్కు చెక్ పెట్టేసి బాలీవుడ్ చెక్కేయనున్నాడట. అక్కడ ఓ బాలీవుడ్ స్టార్ హీరోతో యాక్షన్ మూవీ ప్లాన్ చేస్తున్నాడు అంటూ సమాచారం. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో కాదు బాలీవుడ్ బాద్ష షారుఖ్ ఖాన్. ఎస్.. సుకుమార్, షారుక్ ఖాన్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుందంటూ టాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది..
పుష్ప లాంటి సినిమాలతో పాన్ ఇండియా లెవెల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సుకుమార్తో కలిసి ఈ సినిమా చేసేందుకు షారుఖ్ సైతం ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. ఈ క్రమంలోనే..వీళ్ళిద్దరి కాంబోలో పొలిటికల్ యాక్షన్ డ్రామా రూపొందనుందని తెలుస్తోంది. ఇక తాజాగా షారుక్.. సుకుమార్ కలవడంతో ఈ వార్తలకు మరింత ఊతం ఇచ్చినట్లయింది. అంతేకాదు..ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందించనున్నారని..దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ పెట్టే అవకాశాలు ఉన్నట్లు టాక్..!!