in

pooja hegde completes her part for ‘radhe shyam’!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో పూజా హెగ్డే పని పూర్తయింది. దీంతో బై చెప్పేసి వెళ్లిపోయిందట బుట్టబొమ్మ. వీరిద్దరు జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రాధేశ్యామ్’. ఇదో ప్రేమకథ చిత్రం. ఇటలీ నేపథ్యంలో పునర్జన్మల కథగా ఉంటుందట. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. అయితే కొన్ని సీన్స్ ని రీషూట్ చేయాలని నిర్ణయించారు. ఇటీవలే దానికి సంబంధించిన షెడ్యూల్ మొదలైంది. ముందుగా పూజ హెగ్డేకి సంబంధించిన కొన్ని సీన్స్ ను చిత్రీకరించారు.

దీంతో ఆమె పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రభాస్ పై కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నారు. దీంతో షూటింగ్ పూర్తి కానుంది. ఆ తర్వాత వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులని పూర్తి చేసి.. రిలీజ్ డేటుని ప్రకటించనున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ వరుసగా మూడ్నాలు సినిమాలని లైన్ లో పెట్టిసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సలార్, ఆదిపురుష్ సినిమాలని సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ఇవిగాక.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది.

kalyan ram gives green signal to another periodic movie!

perfectly captured Anupama Parameswaran’s beauty!