in

pawan kalyan, rana dagubbati movie launched officially today!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్  క‌ళ్యాణ్‌, ద‌గ్గుబాటి రానా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో  మ‌ల‌యాళ చిత్రం ‘అయ్య‌ప్ప‌నుమ్ కోశియుమ్‌’ రీమేక్ కానున్న సంగ‌తి తెలిసిందే. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం కొద్ది సేపటి క్రితం అఫీషియ‌ల్‌గా లాంచ్ అయింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్లాప్ కొట్ట‌గా, త్రివిక్ర‌మ్ స్విచాన్ చేశారు. జ‌న‌వ‌రి నుండి మూవీ షూటింగ్ మొద‌లు కానున్న‌ట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో రానా  మలయాళంలో పృధ్వీరాజు సుకుమారన్ నటించిన పాత్రలో క‌నిపించ‌నున్నాడు.  ఆయ‌న స‌ర‌స‌న నివేధా క‌థానాయిక‌గా న‌టించే అవ‌కాశం ఉంది.. ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ సుమారు 40 రోజులు డేట్స్ కేటాయించారట..

Nirvana Manchu Holds The Noble Book Of World Records!

JAYA PRADHA AND RAJENDRA PRASAD IN ‘LOVE @60’!