in

NIVETHA PETHURAJ TO PLAY CRUCIAL ROLE IN ‘VIRATA PARVAM’!

రానా, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం ‘విరాటపర్వం’. ‘నీదీ నాదీ ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని డి. సురేష్‌బాబు సమర్పణలో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చివరి షెడ్యూల్ జరుగుతోంది. ఇప్పటికే పలువురు పేరుపొందిన తారలు నటిస్తోన్న ఈ చిత్రంలో తాజాగా నివేదా పేతురాజ్ జాయిన్ అయ్యారు. ఆమె ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.

లాస్ట్ షెడ్యూల్ షూటింగ్‌లో ఆమె పాల్గొంటున్నారు. మెంటల్ మదిలో సినిమా ద్వారా టాలీవుడ్‌కు నాయికగా పరిచయమై ఆకట్టుకున్న నివేదా పేతురాజ్‌.. అనంతరం చిత్రలహరి, బ్రోచేవారెవరురా, లేటెస్ట్‌గా అల.. వైకుంఠపురములో సినిమాలతో ప్రేక్షకుల హృదయాలపై తనదైన ముద్ర వేసింది. త్వరలో విడుదల కానున్న రామ్ మూవీ రెడ్‌లోనూ పోలీస్ ఆఫీసర్‌గా ఓ కీలక పాత్రలో ఆమె కనిపించనున్నది.

Bollywood actress Disha Patani to romance prabhas?

Pooja Hegde and Rashmika to join Dulquer Salmaan’s next?