మీనాక్షి చౌదరి తమిళ స్టార్ హీరో విజయ్ తో కలిసి గోట్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన విజయ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఆధారంగా ఈ సినిమా 400 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించిన మీనాక్షి చౌదరికి పెద్దగా ప్రాధాన్యత మాత్రం లేదని చెప్పాలి.. ఇలా ప్రాధాన్యత లేని సినిమాలో నటించి తాను తప్పు చేశానని ఈమె తెలియజేశారు..
అయితే ఈ సినిమాతో పాటు మీనాక్షి చౌదరి మహేష్ బాబు తో కలిసి నటించిన గుంటూరు కారం సినిమాలో కూడా తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. ఈ సినిమాలో ఫస్ట్ హీరోయిన్ గా శ్రీ లీల నటించారు. సెకండ్ హీరోయిన్ గా మీనాక్షిని తీసుకున్నప్పటికీ ఈమెను మహేష్ బాబుకు సేవ చేయడం కోసమే తీసుకున్నారా అనే విధంగా ఈమె పాత్ర ఉంటుందని చెప్పాలి. అయితే ప్రస్తుతం మాత్రం మీనాక్షి చౌదరి ఎంతో ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నారు..!!