in

MANCHU VISHNU ANNOUNCES SEQUEL FOR ‘DHEE’!

లక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు మంచు విష్ణు. మొదటగా వరుస ప్లాప్స్ వచ్చినప్పటికీ ‘ఢీ’ సినిమాతో మంచి హిట్ కొట్టాడు విష్ణు. శ్రీను వైట్ల దర్శకత్వంలో 2007లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇందులో విష్ణు సరసన జెనిలియా హీరోయిన్ గా నటించింది. శ్రీహరి, బ్రహ్మానందం, సునీల్, చంద్రమోహన్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

అయితే ఈ సినిమాకి సీక్వెల్ ఎప్పుడుంటుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే అలాంటి అభిమానులకి శుభవార్త చెప్పారు మంచు విష్ణు. ఈ రోజు మంచు విష్ణు పుట్టిన రోజు సందర్భంగా ‘ఢీ’ సినిమాకి సీక్వెల్ చేయబోతున్నట్టుగా ప్రకటించారు విష్ణు. ఈ సినిమాకి “డి & డి డబుల్ డోస్” అంటూ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేశారు. టైటిల్ చూస్తుంటేనే సినిమాలో డబల్ ఫన్ ఉంటుందన్న విషయం అర్ధమైపోతుంది.

ISMART BEAUTY IN PAWAN KALYAN’S MOVIE?

RANA OPENS UP ABOUT HIS HEALTH PROBLEMS!