in

Love Story’s Phenomenal record At Mahesh’s Multiplex!

సెప్టెంబ‌ర్ 24న విడుద‌లైన ల‌వ్ స్టోరీ సినిమా త్వ‌ర‌లోనే ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ‌ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. అక్టోబ‌ర్ 22 శుక్ర‌వారం సాయంత్రం ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విష‌యం తెలిసిన‌ప్ప‌టికీ ల‌వ్ స్టోరీ సినిమాను థియేట‌ర్‌లో చూసేందుకే చాలామంది ప్రేక్ష‌కులు ఇష్ట‌ప‌డుతున్నారు. అందుకే ఇప్ప‌టికీ ఈ సినిమాకు బుకింగ్స్ అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే కేవ‌లం ఒక్క థియేట‌ర్‌లోనే కోటి రూపాయ‌లు వ‌సూలు చేసింది ఈ చిత్రం.

సూప‌ర్ స్టార్ మహేశ్ బాబు కి చెందిన ఏఎంబీ సినిమాస్ మ‌ల్టీప్లెక్స్‌లో సెకండ్ వేవ్ త‌ర్వాత కోటి రూపాయ‌ల గ్రాస్ వ‌సూలు చేసిన తొలి చిత్రంగా ల‌వ్ స్టోరీ రికార్డు సృష్టించింది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ మ‌ల్టీప్లెక్స్‌లో 251 షోలు నిర్వ‌హించ‌గా.. 48,233 మంది ఈ చిత్రాన్ని వీక్షించారు. ఏఎంబీ మ‌ల్టీప్లెక్స్‌లో కోటి రూపాయ‌ల వ‌సూళ్లు సాధించిన చిత్రాలు చాలా అరుదుగా ఉంటాయ‌ని చెప్పొచ్చు. స్టార్ హీరోల‌కు మాత్ర‌మే సాధ్య‌మ‌య్యే క‌లెక్ష‌న్ల‌ను సాయి ప‌ల్ల‌వి ల‌వ్ స్టోరీ చిత్రం రాబ‌ట్ట‌డం నిజంగా విశేష‌మే..

Samantha files defamation cases against YouTube channels!

nikesha patel hot legs and thighs show!