in

kriti sanon wants Vijay Devarakonda in her swayamwar!

పురాణాల్లో మాదిరిగా స్వయంవరం ప్రకటించి తనకు నచ్చిన పురుషుడి మెడలో కల్యాణమాల వేస్తానని చెప్పింది కథానాయిక కృతిసనన్‌. పెళ్లి గురించి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయనే ప్రశ్నకు ఈ భామ పై విధంగా బదులిచ్చింది. మీ స్వయంవరానికి ఏ హీరోల్ని ఆహ్వానించాలని ఉందని అడగ్గా…విజయ్‌ దేవరకొండకు తొలి ప్రాధాన్యతనిస్తానని చెప్పింది..ఇటీవల ఓ లైవ్‌షోలో పాల్గొన కృతిసనన్‌ తన పెళ్లి గురించి సరదాగా ముచ్చటించింది.

‘విజయ్‌ దేవరకొండ మంచి అందగాడు. వ్యక్తిత్వం కూడా విలక్షణంగా అనిపిస్తుంది. విజయ్‌ ఇంటర్వ్యూల్ని చూస్తుంటే అతని మాటల్లో ఏదో తెలియని నిజాయితీ కనిపిస్తుంది. అందుకే నా స్వయంవరంలో అతనికే తొలి ప్రాధాన్యతనిస్తా. ఆ తర్వాత కార్తిక్‌ ఆర్యన్‌, ఆదిత్యరాయ్‌ కపూర్‌లను కూడా ఆహ్వానిస్తాను’ అని కృతిసనన్‌ తెలిపింది. తనకు నచ్చిన హీరోల గురించి మనసులోని మాటల్ని బయటపెట్టానని, వీటిని సరదాగా తీసుకోవాలని కృతిసనన్‌ కోరింది. ప్రస్తుతం ఆమె ‘ఆదిపురుష్‌’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నది..!!

Dulquer Salmaan gives green signal for another Telugu movie?

south star Trisha likely to join Congress!