మహానటి’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కీర్తి సురేష్.. ఆ తర్వాత పాన్ ఇండియా స్థాయి చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తాజాగా ఆమె నటించిన నూతన చిత్రం ‘ఉప్పు కప్పురంబు’ జూలై 4వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రం కథ 1990ల నాటి దక్షిణ భారత గ్రామమైన చిట్టి జయపురం అనే ఊరిని నేపథ్యంగా సాగుతుంది. ఈ కథను కామెడీ ఓరియెంటెడ్గా తెరకెక్కించారు..
ఈ చిత్రంలో ప్రధానంగా సామాజిక అంశాలను కామెడే, ఎమోషన్తో చూపించారు. గ్రామీణ జీవితం, అక్కడి సమస్యలు, మనుషుల మధ్య సంబంధాలు అన్నీ ఇందులో వినోదాత్మకంగా ప్రస్తావించారు. ప్రేక్షకులను ఆలోచింపజేస్తూనే నవ్వించే విధంగా దర్శకుడు కథను తీర్చిదిద్దారు. ఈ చిత్రంలో సుహాస్, బాబు మోహన్, శత్రు, తళ్లూరి రామేశ్వరి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అన్ని భాషల్లో ఈ చిత్రం విడుదల అవుతున్న నేపథ్యంలో కీర్తి నటన మళ్ళీ దేశవ్యాప్తంగా ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి..!!