
సినిమా సినిమాకీ తమ పారితోషికాన్ని పెంచుకుంటూనే ఉంటారు. కొత్తమ్మాయి కయాదు లోహర్ కూడా ఈ జాబితాలో చేరుతుందేమో అనిపిస్తోంది. డబ్బింగ్ సినిమా ‘డ్రాగన్’తో తెలుగు ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకొంది కయాదు. ఆ సినిమాతోనే తెలుగులోనూ ఆఫర్లు అందుకొంది. ప్రస్తుతం ‘పారడైజ్’లో నటిస్తోంది. తను హీరోయిన్గా చేసిన ‘ఫంకీ’ ఇటీవలే విడుదలైంది..
ఈ సినిమా ఫ్లాప్. అయినా సరే, స్క్రీన్ ప్రెజెన్స్ లో తన మార్క్ చూపించింది కయాదు. అందుకే పారితోషికం కూడా పెంచేసింది. ‘ఫంకీ’కి గానూ కయాదు రూ.60 లక్షలు మాత్రమే తీసుకొందని సమాచారం. ఇప్పుడు కోటి అడుగుతోందట. ఇటీవల ఓ నిర్మాత కయాదును సంప్రదిస్తే ‘కోటి తగ్గితే సినిమా చేయను’ అనేసిందని టాక్. ఈ షరతుమీదే కొత్తగా రెండు సినిమాల్ని ఒప్పుకొందని సమాచారం. యూత్ హీరోల సినిమాల్లో కయాదు మంచి ఆప్షనే. సోషల్ మీడియాలో కూడా తనకు మంచి ఫాలోయింగ్ ఉంది..!!
